News February 21, 2025
RJY: పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర

గుంటూరు మిర్చి యార్డులో పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర చేస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా కూటమి నేతలతో గురువారం జరిగిన సమావేశానికి ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు పరదాల చాటున దాక్కొన్న జగన్ పదవి కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
Similar News
News February 22, 2025
తూ.గో: బ్యాడ్మింటన్ సాత్విక్ తండ్రి మృతికి మోదీ సంతాపం

అమలాపురానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథం మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. విశ్వనాథం మరణం పట్ల పీఎం విచారం వ్యక్తం చేస్తూ తండ్రి ప్రేరణతో సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ ఆటగాడిగా ఎదిగిన విధానం ప్రస్తావించారు. విలువలు, కుటుంబానికి అందించిన మార్గదర్శకత, వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులను ప్రేరేపిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.
News February 22, 2025
రాజమండ్రిలో రెండు జీబీఎస్ కేసులు నమోదు

రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం గులియన్ బారే సిండ్రమ్ జీబీఎస్ కేసులు కలకలం రేపాయి. జనరల్ మెడిసన్ విభాగాధిపతి పీవీవీ సత్యనారాయణ, న్యూరాలజిస్టు నీలిమ బాధితులకు పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించారు. ధవళేశ్వరానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రికి చెందిన 38 ఏళ్ల వ్యక్తకి కాళ్లు చచ్చుబడినట్లు అనిపించడంతో జీజీహెచ్లో పరీక్షలు చేసి ధృవికరించారు. కాకినాడ జీజీహెచ్కు తరలించారు.
News February 21, 2025
RJY: మహాశివరాత్రి వేడుకలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శైవ క్షేత్రాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.