News February 21, 2025
సిద్దిపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సిద్దిపేట జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ హరిబాబు అన్నారు. సిద్దిపేట బ్లాక్ 16 మండలాలు, 3 మున్సిపాలిటీల డిసెంబర్ 2024 త్రైమాసికానికి సంబంధించిన JMLBC/ BLBC సమావేశాలు సిద్దిపేటలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఆయన వెంట NABARD DDM నికిల్ రెడ్డి, పశువైద్య శాఖ JD వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 21, 2026
MNCL: సమ్మక్క మొక్కులు, బెల్లం అమ్మకాలకు డిమాండ్

సమ్మక్క సారలమ్మ జాతర ముందే మార్కెట్లో సందడి నెలకొంది. భక్తులు తమ మోక్కులు తీర్చుకుంటున్నారు. నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తుంటారు. దీంతో మార్కెట్లో బెల్లం ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో కిలో 40 రూపాయల వరకు ఉన్న బెల్లం ధర ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80కి పెరిగింది. స్థానిక బెల్లం విక్రయాల దుకాణాల ముందు నిలువెత్తు బంగారంతో మొక్కులకు భక్తులు బారులు తీరుతున్నారు.
News January 21, 2026
గుండుమాల్: మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

గుండుమాల్ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఓమై ఆశ్రా తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
News January 21, 2026
గనుల కేటాయింపుపై ఎంక్వైరీకి సిద్ధమా.. పొన్నం సవాల్

TG: సింగరేణి గనుల కేటాయింపులపై హరీశ్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 2014 నుంచి 2026 వరకు జరిగిన గనుల కేటాయింపులపై ఎంక్వైరీకి సిద్ధమని, మరి మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని మంత్రి వ్యాఖ్యానించారు.


