News February 21, 2025

సిద్దిపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సిద్దిపేట జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ హరిబాబు అన్నారు. సిద్దిపేట బ్లాక్ 16 మండలాలు, 3 మున్సిపాలిటీల డిసెంబర్ 2024 త్రైమాసికానికి సంబంధించిన JMLBC/ BLBC సమావేశాలు సిద్దిపేటలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఆయన వెంట NABARD DDM నికిల్ రెడ్డి, పశువైద్య శాఖ JD వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 13, 2026

నిజామాబాద్: రెండు బైక్‌లు ఢీ

image

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని వేల్పూర్ ఎక్స్‌ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌కు చెందిన గంగారాం,ఎల్లయ్య గాయపడగా,108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News January 13, 2026

NMMS విద్యార్థులకు అలెర్ట్.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి

image

డిసెంబర్ 7న NMMS పరీక్ష రాసిన విద్యార్థులు కుల, ఆదాయ, 7వ తరగతి ధృవీకరణ పత్రాలను ఈ నెల 20లోపు సిద్ధం చేసుకోవాలని DEO వాసుదేవరావు మంగళవారం సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తల్లిదండ్రులు గడువులోగా ఈ పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే స్కాలర్‌షిప్ పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

News January 13, 2026

RJY: మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక బోర్డ్ కమిటీ

image

వరకట్న నిషేధ చట్టం-1961 అమలుపై అవగాహన పెంచాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ సూచించారు. మంగళవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఈ చట్టం అమలు, మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక బోర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. వరకట్న దురాచారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మహిళల రక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.