News February 21, 2025
NRPT: 1000 మంది పోలీసులతో పటిష్ట భద్రత: ఎస్పీ

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేటలోని ఓ ఫంక్షన్ హాలులో బందోబస్తుకు వచ్చిన పోలీసులకు భద్రతాపరమైన సలహాలు, సూచనలు చేశారు. పర్యటన ముగిసే వరకు అప్పగించిన విధులు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. బందోబస్తును పది సెక్టార్లుగా విభజించి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Similar News
News February 22, 2025
సెలవు రోజు కూడా బిల్లులు కట్టవచ్చు: ఎస్ఈ

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకొనే కేంద్రాలు 23వ తేదీ ఆదివారం పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం సెలవు రోజు అయినా ఆదివారం కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. నెల ఆఖరు అయినా బిల్లులు చెల్లించలేదని విచారం వ్యక్తం చేశారు.
News February 22, 2025
మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అర్చకులు పండితులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు తీసుకున్నారు.
News February 22, 2025
BREAKING: బాలుడు అర్ణవ్ కన్నుమూత

TG: హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంటు లిఫ్టు-గోడకు మధ్య <<15540977>>ఇరుక్కున్న బాలుడు<<>> అర్ణవ్ కన్నుమూశాడు. తీవ్ర గాయాలతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. నడుము దగ్గర సర్జరీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.