News February 21, 2025
రాష్ట్రస్థాయిలో పతకం సాధించిన మంచిర్యాల బిడ్డ

కోటపల్లి మండలం నాగంపేటకు చెందిన ఈర్ల సంపత్ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి పురుషుల విభాగంలో పతకం సాధించాడు. కోచ్ సల్ఫల సంతోష్ యాదవ్ మాట్లాడుతూ.. ఈనెల 18నుంచి 19 వరకు ఉస్మానియా యూనివర్సిటీ క్రీడామైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో షాట్ పుట్లో సంపత్ అత్యంత ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించాడన్నారు. పతకం సాధించిన సంపత్ను జిల్లా క్రీడాకారులు అభినందించారు.
Similar News
News December 13, 2025
జగిత్యాల: 2499 మందికి నవోదయ పరీక్ష.. 1860 మంది హాజరు

జవహర్ నవోదయ విద్యాలయం 2026–2027 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. జగిత్యాలలో 4, మెట్పల్లిలో 2, కోరుట్ల, మల్యాల, ధర్మపురి, వెల్గటూరులో ఒక్కో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2,499 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,860 మంది పరీక్షకు హాజరై 74.42 శాతం హాజరు నమోదు అయింది. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగాయి.
News December 13, 2025
MBNR: 2వ విడత ఎన్నికలు.. భారీ బందోబస్తు: ఎస్పీ

రెండో విడత పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 1,249 మంది పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ-1, అదనపు ఎస్పీలు-2, డిఎస్పీలు-7, ఇన్స్పెక్టర్లు-29, సబ్ ఇన్స్పెక్టర్లు-66, మిగతా సిబ్బంది-1,134 మంది పోలీస్ సిబ్బంది జిల్లాలోని హన్వాడ, కోయిలకొండ, దేవరకద్ర, సీసీ కుంట, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాలలో విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News December 13, 2025
అనకాపల్లి: ‘రేపటి నుంచి ఇందన పాదుపు వారోత్సవాలు’

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ఇందన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజినీర్ జి.ప్రసాద్ తెలిపారు. ఇందన పొదుపుపై జిల్లా, డివిజన్ కేంద్రాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కళాశాలలు, హైస్కూల్స్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాల సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామన్నారు.


