News February 21, 2025

టీచర్‌గా మారిన కలెక్టర్.. తాను చెబుతూ పిల్లలతో చెప్పిస్తూ..

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ టీచర్‌గా మారారు. విద్యార్థులకు మ్యాథమెటిక్స్ బోధించారు. విద్యార్థులతో పాఠాలు బోధించేలా చేశారు. వారితో మమేకమై పోయారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహ భోజనం చేశారు. ఈ పరిణామం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎల్లారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఈ సంఘటన గురువారం జరిగింది.

Similar News

News September 17, 2025

రజాకార్లకు వణుకు పుట్టించిన ఐలమ్మ..!

image

భూమికోసం విస్నూరు దేశ్ ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డితో వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రపంచ స్థాయిలో ఇప్పటికీ గుర్తుండిపోయింది. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిని విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ఆ రోజుల్లో రజాకార్లకు వెన్నులో వణుకు పుట్టించింది. జనగామ జిల్లా పాలకుర్తిలో 1945లో ఆంధ్ర మహాసభ ఏర్పాటై, రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది.

News September 17, 2025

మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించింది ఇక్కడే..!

image

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు మహిళలు నగ్నంగా ఆడి పాడాలని రజాకార్ల పాలనలో విస్నూరు దొర ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామంలో అలాంటి ఆకృత్యాలకు సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ విస్నూరు గడి కనిపిస్తోంది. విస్నూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి అరాచకాలకు కేంద్రబిందువే ఈ గడి. మాట వినని వారిని రజాకారులతో ఈ గడికి తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టేవారు.

News September 17, 2025

నల్గొండ: రాచకొండల్లో ‘పెళ్లిగుట్ట’.. స్టోరీ ఇదే

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాచకొండ గుట్టలు కమ్యూనిస్టు గెరిల్లా దళాలకు కేంద్రంగా ఉండేవి. రామన్నపేట, భువనగిరి ప్రాంతాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించే వెంకటనర్సింహారెడ్డి, కృష్ణమూర్తి నాయకత్వంలోని గెరిల్లా దళాలు రక్షణ కోసం రాచకొండకు చేరాయి. గెరిల్లా దళ నేత కృష్ణమూర్తి వివాహం రాచకొండలోనే జరిగింది. ఆనాడు వివాహం నిర్వహించిన గుట్టను ఇప్పటికీ ‘పెళ్లి గుట్ట’గా పిలుస్తుంటారు.