News February 21, 2025

సాత్విక్ సాయిరాజ్‌ తండ్రి గుండెపోటుతో మృతి

image

AP: స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఇంట్లో విషాదం నెలకొంది. కొడుకుకు ‘ఖేల్‌రత్న’ చూసి మురిసిపోవాల్సిన తండ్రి కాశీ విశ్వనాథం(65) గుండెపోటుతో చనిపోయారు. ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం కోసం నిన్న అమలాపురం నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఆయన కుప్పకూలారు. USలో ఉన్న సాత్విక్ సోదరుడు వచ్చాక అంత్యక్రియలు చేస్తారు. 2023కు గాను సాత్విక్‌ ఖేల్‌రత్నకు ఎంపికవగా పలుకారణాలతో అప్పుడు తీసుకోలేదు.

Similar News

News February 22, 2025

ఆప్ వింత.. లేని శాఖకు 20 నెలలుగా మినిస్టర్

image

పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంలో వింత ఘటన జరిగింది. లేని శాఖకు కుల్దీప్‌ సింగ్ 20 నెలలుగా మంత్రిగా ఉన్నారు. తాజాగా అసలు ఆ శాఖ మనుగడలో లేదని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. తప్పు తెలుసుకొని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, కుల్దీప్‌సింగ్ 20 నెలలుగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్(ఉనికిలో లేనిది), NRI అఫైర్స్ శాఖలకు మంత్రిగా ఉండటం విశేషం. ఆప్ ప్రభుత్వం పాలనను జోక్‌లా మార్చిందని BJP మండిపడింది.

News February 22, 2025

కాంగ్రెస్‌లోనే కోనేరు కోనప్ప!

image

TG: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెనక్కితగ్గారు. కోనప్పను సీఎం రేవంత్ రెడ్డి పిలిచి చర్చించి పలు హామీలు ఇవ్వడంతో నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సీఎంతో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. అయితే నిన్న కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన కోనప్ప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్నహరికృష్ణ(BSP)కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

News February 22, 2025

OCల సంఖ్యను కేసీఆర్ ఎక్కువగా చూపారు: సీఎం రేవంత్

image

TG: కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఓసీల సంఖ్యను ఎక్కువగా చూపారని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ సర్వేలో 21 శాతం ఓసీలు ఉంటే తమ సర్వేలో 17 శాతమే ఉన్నట్టు తేలిందన్నారు. ప్రజాభవన్‌లో సీఎం మాట్లాడారు. ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఎందుకు సర్వేలో పాల్గొనలేదు. మేం ముస్లింలను బీసీల్లో కలిపితే బండి సంజయ్ ఎలా ప్రశ్నిస్తారు. గుజరాత్‌లో 70 ముస్లిం కులాలను బీసీల్లో చేర్చింది కనబడలేదా?’ అని సీఎం ఫైర్ అయ్యారు.

error: Content is protected !!