News February 21, 2025
కర్నూలులో జీబీఎస్ కేసు నమోదు

కర్నూలులో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) కేసు నమోదైంది. నగరంలోని భగత్సింగ్నగర్కు చెందిన గోకారమ్మ (46) అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జీబీఎస్ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల నిఘా

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం రాత్రి హైవే, పలు ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర వాహనాలను పరిశీలించారు. రాత్రి వేళల్లో లాడ్జిలు, రైల్వే, బస్సు స్టేషన్లలో కొత్త వ్యక్తుల వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేకరించి అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.
News November 18, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల నిఘా

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం రాత్రి హైవే, పలు ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర వాహనాలను పరిశీలించారు. రాత్రి వేళల్లో లాడ్జిలు, రైల్వే, బస్సు స్టేషన్లలో కొత్త వ్యక్తుల వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేకరించి అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.
News November 18, 2025
కన్నమదాసు.. పల్నాడు వీరత్వానికి ప్రతీక.!

పల్నాడు చరిత్రలో ధైర్యం, విశ్వాసం, విధేయతకు మారుపేరుగా కన్నమదాసు నామం నేటికీ ప్రతిధ్వనిస్తోంది. ఇతను మాచర్ల రాజ్యానికి అంకితభావంతో సేవలు అందించిన ముఖ్య సైన్యాధ్యక్షుడు. కారంపూడి యుద్ధాన్ని విజయపథంలో నడిపించడంలో ఆయనది కీలకపాత్ర. ఈ యుద్ధంలో బ్రహ్మనాయుడికి రక్షకుడిగా నిలిచి, ఆయనను కాపాడారు. ఆయన వీరగాథకు సాక్ష్యంగా కారంపూడిలోని వీర్లగుడిలో ఇప్పటికీ ఆయన ఉపయోగించిన ఖడ్గం ప్రతిష్ఠించి ఉంది.


