News February 21, 2025
ఇంటర్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్: కలెక్టర్

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఆమె మాట్లాడుతూ.. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని, 42,439 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు.
Similar News
News January 20, 2026
ప్రకాశం: మద్యం ప్రీమియం స్టోర్కి దరఖాస్తులు

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయానికి ప్రీమియం స్టోర్ లైసెన్స్ మంజూరు చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి కలిగిన వారు ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులను ఒంగోలు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 20, 2026
ప్రకాశం SP మీకోసంకు 48 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు రాగా వారి సమస్యలను పోలీస్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.
News January 20, 2026
ప్రకాశం SP మీకోసంకు 48 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు రాగా వారి సమస్యలను పోలీస్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.


