News February 21, 2025
తిరుపతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద రన్వే

AP: రేణిగుంట ఎయిర్పోర్టులో ఇంటర్నేషనల్ విమానాలు ల్యాండ్ అయ్యేలా అతిపెద్ద రన్వే అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న 2285 మీటర్ల రన్వేను 3810 మీటర్లకు విస్తరించారు. దీంతో విశాఖ, విజయవాడ కన్నా అతిపెద్ద రన్వే ఏర్పడింది. అలాగే విమానాలు టర్న్ తీసుకునే ప్రాంతాన్ని 700mts నుంచి 1500mtsకు పెంచారు. రన్వేపై లైటింగ్ ఏర్పాటు పనుల కారణంగా ఇవాళ మ.2.30 నుంచి రేపు ఉ.5 గంటల వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు.
Similar News
News November 8, 2025
ఐదో టీ20: భారత్ ఫస్ట్ బ్యాటింగ్

భారత్తో జరుగుతోన్న ఐదో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తిలక్కు రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో రింకూ సింగ్ను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు.
IND: అభిషేక్, గిల్, సూర్య(C), రింకూ సింగ్, జితేష్, సుందర్, దూబే, అక్షర్, అర్ష్దీప్, వరుణ్, బుమ్రా
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, డేవిడ్, ఫిలిప్, స్టొయినిస్, మ్యాక్స్వెల్, డ్వార్షుయిస్, బార్ట్లెట్, ఎల్లిస్, జంపా
News November 8, 2025
అణ్వాయుధ దేశంగా పాక్.. ఇందిర నిర్ణయమే కారణం: మాజీ CIA

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం వల్లే పాక్ అణ్వాయుధ దేశంగా మారిందని US CIA మాజీ ఆఫీసర్ రిచర్డ్ బార్లో వెల్లడించారు. ‘భారత్, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేసి ఇస్లామాబాద్ కహుతా అణు తయారీ కేంద్రంపై దాడికి సిద్ధమయ్యాయి. దీనికి అప్పటి ప్రధాని ఇందిర అంగీకరించలేదు. ఈ దాడి జరిగి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవి. పాక్ అణ్వాయుధాలు తయారు చేసేది భారత్ను ఎదుర్కొనేందుకే’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News November 8, 2025
₹5,942 కోట్లతో సోలార్ సెల్, మాడ్యూళ్ల ప్రాజెక్టు: లోకేశ్

TGకి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ₹5,942 కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద సోలార్ సెల్, మాడ్యూళ్ల ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. దీనికోసం 2005లో నాయుడుపేట ఇండస్ట్రీయల్ పార్కులో 269 ఎకరాలు కేటాయించామన్నారు. 5GW సిలికాన్ ఇంగోట్, 4GW టాప్కాన్ సోలార్ సెల్ యూనిట్లు నెలకొల్పుతారని చెప్పారు. వీటిని 7GWకి విస్తరిస్తారన్నారు. దీనిద్వారా 3500మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.


