News February 21, 2025
వనపర్తి: పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు!

ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. బొల్లారానికి చెందిన శ్రీనివాస్ గౌడ్(50) భార్య పిల్లలతో కలిసి MBNRలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం బంధువు ఒకరు చనిపోవటంతో శ్రీనివాస్ గ్రామానికి వచ్చారు. కాగా.. కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో విరక్తి చెంది తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News January 17, 2026
హైదరాబాద్కు ‘ఊపిరి’.. పెరిగిన గాలి నాణ్యత

కాలుష్యానికి కేరాఫ్గా మారిన హైదరాబాద్కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News January 17, 2026
సంగారెడ్డి జిల్లాలో 256 వార్డుల రిజర్వేషన్లు ఇలా..

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి 256 వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం స్థానాల్లో జనరల్(మహిళ)కు 74, అన్రిజర్వ్డ్కు 55, బీసీలకు 79 (జనరల్ 42, మహిళ 37), ఎస్సీలకు 37 (జనరల్ 21, మహిళ 16), ఎస్టీలకు 11 స్థానాలను కేటాయించారు. ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ రిజర్వేషన్ల ప్రకటనతో ఆశావహుల రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి.
News January 17, 2026
హైదరాబాద్కు ‘ఊపిరి’.. పెరిగిన గాలి నాణ్యత

కాలుష్యానికి కేరాఫ్గా మారిన హైదరాబాద్కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


