News February 21, 2025
5 సార్లు MLA.. HYDలో అవమానం!

ఆయన 5 సార్లు MLAగా పనిచేశారు. అయినా.. హైదరాబాద్లో నిరీక్షణ తప్పలేదు. CM రేవంత్ రెడ్డి కార్యాలయ సిబ్బంది తనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారని మాజీ MLA గుమ్మడి నర్సయ్య వాపోయారు. గంటల పాటు బయట వేచి చూశానని, అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదన్నారు. తన లాంటి సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు అవసరం లేదా? అని ప్రశ్నించారు. CM రేవంత్ రెడ్డి తన లాంటి నాయకులను కలవరా? అంటూ గుమ్మడి నర్సయ్య నిలదీశారు.
Similar News
News October 18, 2025
కృష్ణా: విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడే

తెలుగు సాహిత్యాన్ని ప్రపంచస్థాయికి చేర్చిన కవి సామ్రాట్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడు. 1895 సెప్టెంబర్ 10న ఉమ్మడి కృష్ణా (D) నందమూరులో జన్మించిన విశ్వనాథ తన అద్భుతమైన రచనలతో తెలుగు సాహిత్యంలో అజరామరుడయ్యారు. 1976 అక్టోబర్ 18న ఆయన తుదిశ్వాస విడిచినా, ఆయన సృష్టించిన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’, ‘వేయిపడగలు’ వంటి సాహిత్య సృష్టులు తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.
News October 18, 2025
వలిగొండ: ట్రాక్టర్ ఢీకొని మహిళ దుర్మరణం

వలిగొండ మండలం వర్కట్పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగారం సబ్ సెంటర్ పరిధిలోని వర్కట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న సుజాత స్కూటీపై వలిగొండ వైపు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుజాత అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
News October 18, 2025
విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

AP: VSP పార్ట్నర్షిప్ సమ్మిట్పై భారీ అంచనాలున్నాయి. పారిశ్రామికవేత్తలను పిలిచేందుకు CBN, లోకేశ్ విదేశాలకు వెళ్తున్నారు. గూగుల్, TCS వంటి సంస్థల రాకతో ఈసారి పెట్టుబడులు పెరగొచ్చంటున్నారు. కాగా 2016లో ₹7.03L Cr, 2017లో ₹6.98L Cr, 2018లో ₹3.10L Cr పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిలో పెండింగ్ అంశాల్ని పట్టాలెక్కించడంతో పాటు ఈసారి కొత్తవారిని ఆహ్వానించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.