News February 21, 2025

24 గంటలూ షాపులు తెరవచ్చు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

TG: రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రంలో మార్చి 2 నుంచి 31 వరకు షాపులను 24 గంటలూ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. సిబ్బంది రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే యాజమాన్యం రెట్టింపు వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. సెలవుల్లో పనిచేస్తే ప్రత్యామ్నాయ లీవ్ ఇవ్వాలన్నారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.

Similar News

News February 22, 2025

BREAKING: రాష్ట్రంలో 14,236 ఉద్యోగాలు

image

TG: రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖలో కొలువుల జాతరకు ప్రభుత్వం సిద్ధమైంది. 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

News February 22, 2025

పంట పొలంలో పెళ్లి.. వైరల్

image

భారీ ఫంక్షన్ హాల్, డెకరేషన్, డీజే చప్పుళ్ల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో పంజాబ్‌కు చెందిన ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. తమ గ్రామంలోని పంట పొలం మధ్య వివాహం చేసుకుని దుర్లభ్ సింగ్, హర్మన్‌కౌర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు చేసిన పోరాట నినాదాలను ముద్రించిన స్వీట్ బాక్సులను అతిథులకు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

News February 22, 2025

కాంగ్రెస్ అసమర్థత వల్లే SLBC ఘటన: హరీశ్

image

TG: SLBC <<15542138>>సొరంగం<<>> కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనమని హరీశ్‌రావు మండిపడ్డారు. 4 రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతోందని తెలిసినా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు, KTR స్పందిస్తూ.. ఘటన ఉ.8:30కు జరిగితే మధ్యాహ్నం దాకా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!