News February 21, 2025
మిర్చిధరలపై కేంద్రమంత్రి సమావేశం

AP: మిర్చి పంటకు కనీస మద్దతు ధరపై వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ నేతృత్వంలో నేడు భేటీ జరగనుంది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ పథకం ద్వారా పంట మద్దతు ధరపై సంబంధిత వర్గాలతో చర్చించనున్నట్లు సమాచారం. ధరల పతనంపై సమీక్షతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని మిర్చి రైతుల సమస్యను కేంద్రమంత్రికి వివరించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 7, 2026
వాకింగ్కి టైమ్ లేదా? ఈ చిన్న పనులతో గుండె ఆరోగ్యం

✦ జిమ్/లాంగ్ వాక్కు టైమ్ లేకపోయినా VILPA (విగరస్ ఇంటర్మిటెంట్ లైఫ్స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
✦ లిఫ్ట్/ఎస్కలేటర్కు బదులు మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం మంచిది.
✦ ఇంటి పనులు చేయడం, గ్రాసరీస్ మోయడం, పిల్లలతో ఆడుకోవడమూ యాక్టివిటీనే.
✦ ఎక్కువసేపు కూర్చోకుండా 30నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరగాలి.
✦ డాన్స్, వంట చేస్తూ ఫుట్ ట్యాప్ చేయడం కూడా ఎక్సర్సైజ్ చేసినట్టే.
News February 7, 2026
దివ్యాంగులకు వెసులుబాటు కల్పించిన UPSC

సివిల్స్ ఎగ్జామ్స్ రాసే దివ్యాంగుల(Pwbd)కు పరీక్షా కేంద్రం ఎంపికలో <<19061199>>UPSC<<>> వెసులుబాటు కల్పించింది. అభ్యర్థులు కోరుకున్న కేంద్రాన్ని కేటాయించనున్నట్లు పేర్కొంది. గరిష్ఠ సామర్థ్యం(ఫుల్ స్ట్రెంత్) చేరుకున్నప్పటికీ దివ్యాంగ అభ్యర్థులకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనుంది. అవసరమైన చోట పరీక్షా కేంద్రం సామర్థ్యాన్ని పెంచుతామని UPSC తెలిపింది. అయితే ఇది ఇతరులకు వర్తించదని స్పష్టం చేసింది.
News February 7, 2026
టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<


