News February 21, 2025

JKలో పేలుడు: పాక్ ఆర్మీతో భారత్ ఫ్లాగ్ మీటింగ్!

image

నియంత్రణ రేఖ (LOC) వద్ద కీలక పరిణామం చోటు చేసుకోబోతోందని తెలిసింది. భారత్, పాకిస్థాన్ ఆర్మీలు నేడు ఫ్లాగ్ మీటింగ్‌లో పాల్గొంటాయని సమాచారం. మరికాసేపట్లో బ్రిగేడియర్ లెవల్ ఆఫీసర్లు సమావేశం అవుతారు. 2021 తర్వాత పాక్‌తో ఇలాంటి మీటింగ్ జరగడం ఇదే తొలిసారి. కాగా మరోవైపు జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని నక్కర్ కోట్లో పేలుడు సంభవించింది. ఇది పాక్ పన్నాగమేనని ఆర్మీ అనుమానిస్తోంది.

Similar News

News November 11, 2025

ఏపీ అప్డేట్స్

image

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‌కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్‌ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ

News November 11, 2025

డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

image

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్‌ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్‌కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.

News November 11, 2025

మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

image

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది.
* వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్‌ చల్లితే దోమల బెడద తగ్గుతుంది.
* కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్‌తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది.
* అన్నం మెతుకులు విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి.
* చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.