News February 21, 2025
జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ఎవరూ నమ్మరు: మంత్రి కొల్లు

AP: కిడ్నాపులు చేసిన వారిపై కేసులు పెట్టడం తప్పా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ నేరస్థులను వెనకేసుకురావడం దారుణమన్నారు. ‘జగన్ చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే అసెంబ్లీకి రావడం లేదు. ప్రజలు నడి రోడ్డు మీద నిలబెట్టినా ఆయనలో ఇంకా మార్పు రాలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ గుంటూరు మిర్చి యార్డులో రాద్ధాంతం చేశారు. ఆయన ఐ ప్యాక్ డ్రామాలను ఎవరూ నమ్మరు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 5, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.
News November 5, 2025
ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు. <<-se>>#Pregnancycare<<>>
News November 5, 2025
పంజాబ్& సింధ్ బ్యాంక్లో 30 పోస్టులు

పంజాబ్ & సింధ్ బ్యాంక్(<


