News February 21, 2025
చాహల్ రూ.60కోట్ల భరణం.. ధనశ్రీ ఫ్యామిలీ ఖండన

చాహల్- ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారని, రూ.60 కోట్ల భరణం ఇచ్చేందుకు చాహల్ ఒప్పుకున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. వీటిని ధనశ్రీ కుటుంబ సభ్యులు ఖండించడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చాహల్ను డబ్బు డిమాండ్ చేయలేదని, అలాంటి ఆఫర్ కూడా రాలేదని స్పష్టం చేశారు. అవాస్తవాలను ప్రచారం చేసి వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు. అయితే విడాకులపై మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేదు.
Similar News
News November 11, 2025
ఆత్మాహుతి దాడే! బలం చేకూరుస్తున్న ఆధారాలు

DL: ఎర్రకోట వద్ద కారు పేలుడు ఆత్మాహుతి దాడి అనేలా ఆధారాలు లభిస్తున్నాయి. i20 కారులో ఫ్యూయల్, అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లను దుండగుడు తీసుకొచ్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అటు హరియాణా రిజిస్టర్డ్ కారును కశ్మీర్ వాసి తారిఖ్ కొన్నాక పలువురి నుంచి నిన్న డ్రైవ్ చేసిన Dr.ఉమర్కు చేరింది. JK పోలీసులు UP ఫరీదాబాద్లో నిన్న అరెస్టు చేసిన ఉగ్రవాద అనుమానితులతో ఇతడికి కాంటాక్ట్స్ ఉన్నట్లు సమాచారం.
News November 11, 2025
ధనియాల సాగు – అనువైన రకాలు

మనదేశంలో రబీ పంటగా అక్టోబర్-నవంబర్ నెలల్లో ధనియాలు నాటుతారు. ఈ పంట ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. APలో రాయలసీమ జిల్లాల్లో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు.
☛ ధనియాల సాగుకు అనువైన రకాలు – సి.ఒ.1, సి.ఒ.2, సి.ఒ.3, సి.ఒ.(సి.ఆర్)4, సి.ఎస్.287, కరన్, సి.ఐ.ఎం.ఎస్-33, సి.ఎస్.2, జి.ఎ.యు-1, యు.డి-1, యు.డి-2, యు.డి-20, యు.డి-21. వీటిలో అనువైన రకాలను వ్యవసాయ నిపుణుల సూచనలతో నాటుకోవాలి.
News November 11, 2025
BP ట్యాబ్లెట్స్ వాడటం మానేస్తున్నారా?

గత నెల రోజులుగా BP (అధిక రక్తపోటు) ట్యాబ్లెట్స్ మానేయడంతో అందెశ్రీ మరణించారని <<18254470>>వైద్యులు<<>> నిర్ధారించిన విషయం తెలిసిందే. ఇలా బీపీ ట్యాబ్లెట్స్ ఆపడం ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే రక్తపోటు అకస్మాత్తుగా పెరిగి, పక్షవాతం, గుండెపోటు వంటి తీవ్ర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులను ఆపొద్దని/మార్చొద్దని, ఇది ప్రాణాపాయానికి దారితీయొచ్చని చెబుతున్నారు. SHARE IT


