News February 21, 2025

ఆందోళన విరమించిన TTD ఉద్యోగులు

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే ఉద్యోగి బాలాజీ సింగ్‌ను బోర్డు సభ్యుడు <<15507901>>నరేశ్<<>> దూషించడంతో 2 రోజులుగా TTD ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తెర పడింది. దూషణ విషయంపై టీటీడీ ఉద్యోగులతో ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు ఇవాళ భేటీ అయ్యారు. బాలాజీసింగ్ విషయంలో తప్పు జరిగిందని నరేశ్ ఒప్పుకొని, క్షమాపణలు చెప్పినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. కుటుంబంలో వచ్చిన చిన్న సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకున్నట్లు వివరించారు.

Similar News

News February 22, 2025

BIG BREAKING: రేపటి గ్రూప్-2 పరీక్షలు యథాతథం

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని APPSC అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది.

News February 22, 2025

రేపు భారత్ ఓడిపోతుంది: IIT బాబా

image

మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా వైరల్ అయిన అభయ్ సింగ్ రేపు పాకిస్థాన్‌తో మ్యాచులో భారత్ ఓడిపోతుందని అంచనా వేశారు. ‘నేను ఇప్పుడే చెబుతున్నానుగా ఇండియా అస్సలు గెలవదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని స్పష్టం చేశారు. బాబా కామెంట్లపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

News February 22, 2025

హీరో రామ్ పోతినేనితో మంత్రి కందుల భేటీ

image

టాలీవుడ్ హీరో రామ్ పోతినేనిని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ షూటింగ్ సెట్‌లో కలిశారు. రాజమండ్రిలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. కాగా ‘RAPO22’ మూవీ కోసం రామ్ రాజమండ్రిలో ఉన్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ అక్కడి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మినిస్టర్ ఆయనను కలిశారు.

error: Content is protected !!