News March 21, 2024
పవన్ కళ్యాణ్ జాగ్రత్త: YCP
AP రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పరిస్థితులు పూర్తిగా హీటెక్కాయి. పవన్ ఎంపీగా పోటీ చేస్తే తాను పిఠాపురంలో బరిలోకి దిగుతానన్న టీడీపీ అభ్యర్థి వర్మ కామెంట్లపై YCP స్పందించింది. ‘జాగ్రత్త పవన్. ఏదన్నా అటూ ఇటూ అయితే పిఠాపురంలో నిన్ను ఓడించేవాళ్లలో మొదటి వరసలో ఉండేది టీడీపీనే అనుకుంటా. చూస్కో మరి’ అని Xలో పోస్ట్ చేసింది.
Similar News
News July 8, 2024
బాలిక హత్య.. నిందితుడి ఆచూకీ చెబితే రూ.50,000: పోలీసులు
AP: అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని హత్య చేసిన ఉన్మాది సురేశ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ చెబితే రూ.50,000 నగదు బహుమతి అందజేస్తామంటూ జిల్లా పోలీసులు ప్రకటించారు. అతని ఫొటోలు, వివరాలతో పోస్టర్ను విడుదల చేశారు. ప్రేమ పేరుతో బాలికను వేధించి వేటకొడవలితో <<13581652>>దారుణంగా<<>> చంపేసిన విషయం తెలిసిందే.
News July 8, 2024
చంద్రబాబు, జగన్, పవన్పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
APలో ప్రతిపక్షమనేదే లేదని YSR జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఇక్కడ ఉన్నదంతా పాలకపక్షమే. బీజేపీ అధికారంలో ఉంది. BJP అంటే బాబు, జగన్, పవన్. వీళ్లంతా మోదీ పక్షమే. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది షర్మిల ఒక్కరే. 2029లో ఆమె ఏపీ సీఎం అవుతారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, ఆమె పోరాటం వృథా కాదు’ అని మంగళగిరిలో జరిగిన సభలో ఆయన వ్యాఖ్యానించారు.
News July 8, 2024
భారత క్రికెట్ జట్టుకు మాల్దీవులు ఆహ్వానం
T20WCను సాధించిన టీమ్ ఇండియాను తమ దేశంలో పర్యటించాల్సిందిగా మాల్దీవులు టూరిజం సంస్థలు విజ్ఞప్తి చేశాయి. అక్కడ విజయోత్సవాలు చేసుకుని, మధురానుభూతులు పొందాలని కోరాయి. ఇరు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, క్రీడా సంబంధాలున్నాయని పేర్కొన్నాయి. IND జట్టును ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పాయి. భారత్తో దౌత్యపరమైన వివాదం కొనితెచ్చుకున్న మాల్దీవులకు పర్యాటక పరంగా ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.