News February 21, 2025
కేసీఆర్ వల్లే దక్షిణ తెలంగాణకు అన్యాయం: మంత్రి ఉత్తమ్

TG: మాజీ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే దక్షిణ తెలంగాణ ప్రతి ఏడాది 100 TMCల నీటిని కోల్పోతోందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. పదేళ్ల నుంచి భూసేకరణ చేయలేదని, నిధులు కేటాయించలేదని విమర్శించారు. SLBC సొరంగం ద్వారా నిండే రిజర్వాయర్లు, డిండి లిఫ్ట్, పాలమూరు-రంగారెడ్డిలను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. రేవంత్ నాయకత్వంలో మూడేళ్లలో కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
Similar News
News November 11, 2025
జడేజాను వదులుకోవద్దు: సురేశ్ రైనా

జడేజాను CSK వదులుకోనుందనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా స్పందించారు. జడేజాను కచ్చితంగా రిటైన్ చేసుకోవాలన్నారు. CSKకు అతను గన్ ప్లేయర్ అని, టీమ్ కోసం కొన్నేళ్లుగా ఎంతో చేస్తున్నారని గుర్తు చేశారు. ‘సర్ జడేజా’ జట్టులో ఉండాల్సిందే అని జట్టు యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు సమాచారం. RRతో ట్రేడ్లో జడేజా స్థానంలో CSK సంజూను తీసుకోవడం ఖరారైనట్లు క్రీడావర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే.
News November 11, 2025
కుందేళ్ల పెంపకం.. మేలైన జాతులు ఏవి?

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.
News November 11, 2025
బిహార్ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.


