News February 21, 2025
బాలానగర్: సీసీ కెమెరాలను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ

బాలానగర్ సీఐ నర్సింహా రాజు నేతృత్వంలో ఇటీవల సీసీటీవీల ప్రాముఖ్యత, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా డివిజన్ పరధిలోని ఆదర్శ్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను శుక్రవారం సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి, బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్, బాలానగర్ ఏసీపీ హనుమంతా రావుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు నేర నియంత్రణకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
Similar News
News February 22, 2025
కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

➤ విద్యార్థిని అశ్లీల చిత్రాలతో వ్యాపారం.. నిందితుల అరెస్టు. ➤ కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు గురు భక్తి ఉత్సవాల ఆహ్వాన పత్రిక. ➤ వలసలు వెళ్లకుండా పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు. ➤ జాతీయ స్థాయి స్కాలర్షిప్లో కోసిగి విద్యార్థుల ప్రతిభ. ➤ వరి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న విదేశీ పర్ఫాల్ స్వాపెన్ పక్షులు. ➤ కర్నూలు: రెండుసార్లు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ➤ జిల్లాలో రెచ్చిపోతున్న హిజ్రాలు.
News February 22, 2025
ఇదే రికార్డు.. భార్యకు రూ.380 కోట్లు భరణం!

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఓ సెలబ్రిటీ భరణం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. చాహల్ రూ.60 కోట్లు భరణంగా ఇవ్వనున్నారని వార్తలు రాగా ధనశ్రీ ఫ్యామిలీ ఖండించిన విషయం తెలిసిందే. అయితే, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ 2014లో తన భార్య సుస్సేన్కు రూ.380 కోట్ల భరణం ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇండియన్ సెలబ్రిటీల్లో ఇప్పటివరకూ ఇదే అత్యధికమని చెబుతున్నాయి.
News February 22, 2025
విశాఖలోని 16 సెంటర్లలో గ్రూప్-2 పరీక్ష: జేసీ

విశాఖ జిల్లాలో 16 ఎగ్జామ్స్ సెంటర్లలో రేపు గ్రూప్-2 పరీక్ష నిర్వహించనునట్లు జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్ -2 పరీక్ష ఉండనుందన్నారు. పరీక్షా సమయానికి 15 నిమిషాలు ముందుగా అభ్యర్థులు ఎగ్జామ్స్ సెంటర్లకు హాజరు కావాలన్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో 11,029 అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.