News February 22, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

Similar News

News January 26, 2026

బ్రాహ్మణకోడూరు విద్యార్థి అక్షర విజయం.. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం!

image

పొన్నూరు(M) బ్రాహ్మణకోడూరు MPPS 1వ తరగతి విద్యార్థి షేక్ సమాన్ మాలిక్ రాష్ట స్థాయిలో చేతిరాత పోటీలలో ప్రథమ స్థానం పొందాడు. క్యాలిగ్రఫీ టీమ్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో గుంటూరులో విద్యార్థి సమాన్ మాలిక్‌ను DEO సలీం బాషా అభినందించి ప్రశంసా పత్రం, షీల్డ్, రూ. 2 వేల నగదు బహుమతి ప్రధానం చేశారు. విద్యార్థి సమాన్ మాలిక్‌ను పొన్నూరు MEOలు రాజు, విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.

News January 26, 2026

GNT: సీఎం క్యాంప్ ఆఫీసులో గణతంత్ర వేడుకలు

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులకు సీఎం స్వయంగా స్వీట్లు పంచిపెట్టారు. వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News January 26, 2026

GNT: గణతంత్ర వేడుకల బందోబస్తు పర్యవేక్షిస్తున్న ఎస్పీ

image

రాయపూడిలో జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక, గ్యాలరీలు, వీవీఐపీ ప్రాంతాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ గస్తీపై సమీక్షించి అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు అమలు చేయాలని సూచించారు.