News February 22, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు భక్తులు 462 మంది తలనీలాలు సమర్పించగా రూ.23,100, ప్రసాదాలు రూ.6,15,500, VIP దర్శనం రూ1,35,000, బ్రేక్ దర్శనాలు రూ.1,17,600, ప్రధానబుకింగ్ రూ.84,300, కార్ పార్కింగ్ రూ.1,62,000, వ్రతాలు రూ.63,200, లీజెస్ రూ.1,54,526 తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.14,84,440 ఆదాయం వచ్చినట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు.
Similar News
News November 8, 2025
HYD జలమండలికి అవార్డుల పరంపర..!

ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ, ఉత్తమ యాజమాన్య అవార్డ్లను గెలుచుకున్న HYD జలమండలి, మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపును తన ఖాతాలో వేసుకుంది. తమ సంస్థలో ఆర్టీఐ కేసులను సమర్థవంతంగా పరిష్కరించినందుకు తెలంగాణ సమాచారం కమిషన్ ‘ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్’ పురస్కారాన్ని ప్రకటించింది. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డును సైతం కైవసం చేసుకుంది.
News November 8, 2025
జగిత్యాల: ‘ర్యాలీని విజయవంతం చేయాలి’

తమ సమస్యల పరిష్కారం కోసం ముంబాయిలో ఈ నెల 17న నిర్వహిస్తున్న రిప్రెజెంటేటివ్స్ ర్యాలీని విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని కోరారు. నాయకులు రాము, సునీల్, అరవింద్ పాల్గొన్నారు.
News November 8, 2025
ముగిసిన జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ నామినేషన్ ప్రక్రియ

జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ 2025-27 కార్యవర్గం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగిసినట్లు జిల్లా అడహక్ కమిటీ సభ్యుల వెల్లడించారు. మెయిన్ బాడీ 7 పదవులకు 9 నామినేషన్లు, జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లకు 18 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. ఈరోజు 2 పదవులకు విత్ డ్రా చేసుకున్నారని, ఈనెల 15న ఎన్నికలు నిర్వహిస్తామని, పాస్టర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.


