News February 22, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు భక్తులు 462 మంది తలనీలాలు సమర్పించగా రూ.23,100, ప్రసాదాలు రూ.6,15,500, VIP దర్శనం రూ1,35,000, బ్రేక్ దర్శనాలు రూ.1,17,600, ప్రధానబుకింగ్ రూ.84,300, కార్ పార్కింగ్ రూ.1,62,000, వ్రతాలు రూ.63,200, లీజెస్ రూ.1,54,526 తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.14,84,440 ఆదాయం వచ్చినట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు.

Similar News

News September 19, 2025

పాఠశాలల భద్రతకు సహకరించండి: యాదాద్రి డీఈవో

image

దసరా సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల భద్రతకు గ్రామస్థులు సహకరించాలని యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పాఠశాల ఆవరణలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా హెచ్‌ఎంలు, ఎంఈఓలు, ‘అమ్మ ఆదర్శ కమిటీ’ సభ్యుల సహకారంతో చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు దేవాలయాలతో సమానమని, వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

News September 19, 2025

భువనగిరిలో ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు

image

యాదాద్రి భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం అండర్-19 విభాగంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలలో నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు చెందిన జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొనవచ్చని కళాశాల ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న బాల, బాలికలు తమ ఎస్ఎస్‌సీ మెమోతో ఉదయం 8:30 గంటలకు కళాశాలకు చేరుకోవాలని సూచించారు.

News September 19, 2025

ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దు: KMR కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి ఉన్నాయని, వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో నీరు నిలవకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.