News February 22, 2025
రైతులకు మేలు జరిగేలా అధికారులు కృషి చేయాలి: కలెక్టర్

రైతులకు అన్ని రకాలుగా మేలు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. రైతుల రిజిస్ట్రేషన్, యూరియా అమ్మకాలు, ఈ పంట, ఈ కేవైసీ, లోన్ల మంజూరు పై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పై మండల వారీగా వివరాల గురించి ఆరా తీశారు.
Similar News
News November 5, 2025
కోర్టుకు పాస్పోర్ట్ అప్పగించిన రాజంపేట MP

ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటన ముగియడంతో ఆయన ఇండియాకు వచ్చారు. మద్యం కేసులో ఆయనకు కండిషనల్ బెయిల్ వచ్చింది. పాస్పోర్ట్ను కోర్టులో సమర్పించాలని అప్పట్లోనే ఆదేశించింది. అమెరికా వెళ్లే ముందు ఆయన పాస్పోర్టు తీసుకోగా.. ఇవాళ కోర్టులో తిరిగి సమర్పించారు.
News November 5, 2025
ఆరిలోవలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సింహాచలం నుంచి బైక్ పై ఆరిలోవ వైపు వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు పై ఉన్న ఇద్దరు యువకులు గాయపడడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. మృతుడు గురుద్వార్కి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు.
News November 5, 2025
నవంబర్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు!

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఉభయ సభలు ఈనెల 24 లేదా 25 నుంచి సమావేశం అవుతాయని పేర్కొన్నాయి. డిసెంబర్ 19 వరకు ఇవి కొనసాగుతాయని చెప్పాయి. కాగా EC చేపట్టిన దేశవ్యాప్త SIRను వ్యతిరేకిస్తూ ఓట్ చోరీ అంటూ విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు దీనిపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. US టారిఫ్స్పైనా ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.


