News February 22, 2025

అమలాపురం: క్రీడాఅవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి

image

2025–26 సంవత్సరానికి క్రీడలు, ఆట విభాగాలలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు స్పోర్ట్స్‌ అవార్డు కోసం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు కోనసీమ జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ సురేష్‌కుమార్‌ తెలిపారు. కోనసీమ జిల్లాలోని అర్హతగల క్రీడాకారులు, ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్‌ బాలురు, టేబుల్‌ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు, కోచ్ లు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Similar News

News January 17, 2026

సావిత్రి గౌరీ నోము ఎలా ఆచరించాలి?

image

మట్టితో చేసిన దేవతా మూర్తుల బొమ్మలను ఓ పీఠంపై ఉంచి, వాటి మధ్యలో పసుపుతో చేసిన గౌరీదేవిని పూజించాలి. నూతన వధువులు ఈ వ్రతాన్ని వరుసగా 9 రోజుల పాటు భక్తితో ఆచరిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. రోజూ అమ్మవారికి 9 రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి పండ్లు, తాంబూలం వాయనంగా ఇవ్వాలి. తొమ్మిదో రోజు పూజ పూర్తయ్యాక, ఆ మట్టి బొమ్మలను పుణ్యతీర్థాలలో నిమజ్జనం చేయాలి.

News January 17, 2026

మహబూబ్‌నగర్‌ జిల్లాకు నేడు CM రేవంత్‌

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని చిట్టిబోయినపల్లిలో ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్నత సాంకేతిక విద్యకు కొత్త ఊపొస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య అందుబాటులోకి రానుందని నిపుణులు అంటున్నారు.

News January 17, 2026

నటి శారదకు ప్రతిష్ఠాత్మక అవార్డు

image

మలయాళ చిత్రసీమలో అత్యున్నత గౌరవంగా భావించే జేసీ డానియల్ అవార్డు-2024ను సీనియర్ నటి శారదకు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మలయాళ సినిమాకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ఇచ్చింది. రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో కూడిన ఈ అవార్డును ఈ నెల 25న CM పినరయి విజయన్ అందజేయనున్నారు. ఈ అవార్డు పొందిన 32వ సినీ ప్రముఖురాలిగా శారద నిలిచారు.