News February 22, 2025
హుస్నాబాద్: రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైన ప్రభుత్వ కళాశాల ప్రాజెక్టులు

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పరిశోధన ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక అయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థుల నైపుణ్యతను అభినందించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను పరిశోధన రంగంవైపు మళ్లించేందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రదర్శన నిర్వహిస్తుందన్నారు.
Similar News
News February 25, 2026
నిజామాబాద్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, 9:05 వరకు మాత్రమే అనుమతిస్తామని డీఐఈవో తెలిపారు. మాస్ కాపీయింగ్ నివారణకు 3 ఫ్లయింగ్, 8 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది.
News February 25, 2026
నేడు KTR రాక.. నాగర్కర్నూల్లో హైటెన్షన్

కుమ్మెర కులోన్మాద ఘటనలో 8 మంది నిందితుల్లో ముగ్గురినే అరెస్ట్ చేశారని, మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు మ.12 గంటలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నాగర్కర్నూల్కు రానున్నారు. భారీగా పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నేతలు తరలిరావాలని పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
News February 25, 2026
GNT: రాజధాని పనుల్లో గడువు టెన్షన్.. మళ్లీ కొత్త బాధ్యతలెలా?

రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం రూ.1,000 కోట్లతో చేపట్టబోయే మౌలిక వసతుల పనులు రైతుల ప్లాట్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ సంస్థలకు అప్పగిస్తున్నట్లు మంత్రి నారాయణ పలు గ్రామ సభలో చెప్పారు. అయితే రాజధాని నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థల అవస్థలు పడుతుంటే అదనంగా మౌలిక వసతులు కల్పనకు అప్పగించడం సముచితంగా లేదని పలువురు అంటున్నారు. ఇతర వ్యక్తులకు అప్పజెప్పితే బాగుంటుందన్నారు.


