News March 21, 2024

ఖమ్మం: రైల్వే లైన్ కోసం మార్కింగ్

image

రైల్వే లైన్ కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్న మార్కింగ్‌తో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో డోర్నకల్-మిర్యాలగూడెం వరకు రైల్వే లైన్ కోసం అధికారులు ఖమ్మం రూరల్ మండలంలో సర్వేని చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు వ్యక్తం కావడంతో నిలిపివేశారు. మూడు రోజులుగా ఎస్సీపీ నలుపు, తెలుపు రంగులతో మార్కింగ్‌ను ఎంవి పాలెం, కాచిరాజుగుడెం, ఆరేకొడు, చింతపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేశారు.

Similar News

News July 5, 2024

ఖమ్మం శివారు రైల్వే పట్టాలపై మృతదేహం 

image

ఖమ్మం రూరల్ మండలం‌ దానావాయిగూడెం వద్ద  రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.‌ ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ భాస్కర్ రావు పేర్కొన్నారు.

News July 5, 2024

వేరుశనగ నూనె ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం

image

కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

News July 5, 2024

ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి తుమ్మల

image

టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్స్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.