News March 21, 2024

ఏపీ ఎన్నికల ఇన్‌ఛార్జులను ప్రకటించిన బీజేపీ

image

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ, రాజస్థాన్, హరియాణాకు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి, కో-ఇన్‌ఛార్జీలను నియమించింది. ఏపీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కో-ఇన్‌ఛార్జిగా యూపీ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్‌ను నియమించింది. రాజస్థాన్‌కు వినయ్, విజయా, ప్రవేశ్ వర్మను, హరియాణాకు సతీశ్ పూనియా, సురేంద్ర సింహ్ నాగర్‌ను నియమించింది.

Similar News

News October 2, 2024

భారత పౌరులు అప్రమత్తంగా ఉండండి

image

ఇజ్రాయెల్‌‌పై ఇరాన్ క్షిపణి దాడులు, కీల‌క న‌గ‌ర‌మైన టెల్ ఆవీవ్‌లో సామూహిక కాల్పుల ఘ‌ట‌నల నేపథ్యంలో అక్కడి భారత పౌరులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఎంబసీ కోరింది. భార‌త పౌరులు జాగ్ర‌త‌గా ఉండాలని, స్థానిక అధికారులు సూచించిన విధంగా భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని సూచించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో 24×7 ఎంబ‌సీ హెల్ప్‌లైన్‌ను సంప్ర‌దించాల‌ని కోరింది.

News October 2, 2024

అణు యుద్ధం మొదలు కానుందా?

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగింది. దీంతో అటు ఇరాన్, ఇటు అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. ఒక వేళ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదిరితే న్యూక్లియర్ వార్ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా, హౌతీలతో ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ కూడా యుద్ధంలోకి ఎంటరైంది. యుద్ధం ఇలాగే కొనసాగితే మిడిల్ ఈస్ట్ రగిలిపోయే ఛాన్స్ ఉంది.

News October 2, 2024

నీరజ్‌ చోప్రాకు గుడ్ బై చెప్పిన కోచ్

image

జావెలిన్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో ఆయన కోచ్ క్లాస్ బార్టోనీఎట్జ్ బంధం ముగిసింది. 75 ఏళ్ల క్లాస్ ఇకపై తన కుటుంబంతో గడిపేందుకు స్వదేశం జర్మనీకి పయనమయ్యారు. ఆయన గతంలోనే వెళ్లిపోదామనుకున్నప్పటికీ రిక్వెస్ట్ చేసి ఆపామని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈసారి మాత్రం వెళ్లడానికే నిర్ణయించుకున్నారన్నారు. నీరజ్ 2సార్లు ఒలింపిక్ మెడల్ గెలవడం వెనుక క్లాస్ కీలక పాత్ర పోషించారు.