News February 22, 2025
కరీంనగర్: హోమో సెక్స్కు అడ్డు చెప్పాడని హత్య

హోమో సెక్స్కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు KNRలోని రేకుర్తి గ్రామానికి చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Similar News
News September 18, 2025
SE, DEలతో NPDCL సీఎండీ వీడియో కాన్ఫరెన్స్

హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈలతో సమీక్షించి, ట్రాన్స్ఫార్మర్ల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లపై ఉన్న సర్వీసులను మ్యాపింగ్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సంస్థ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఈ చర్యలు తోడ్పడతాయని తెలిపారు.
News September 18, 2025
PDPL: ప్రీ- ప్రైమరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లాలో కొత్తగా ప్రారంభించనున్న 12 ప్రీ- ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లుగా, ఆయాలుగా తాత్కాలిక పద్ధతిన పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి బుధవారం తెలిపారు. ఇందుకు సెప్టెంబర్ 21లోపు అవకాశం ఉందన్నారు. ఇంటర్, 7వ తరగతి విద్యార్హతలతో 18- 44ఏళ్ల మధ్య వయస్సున్నవారు సంబంధిత HMలకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
News September 18, 2025
మహబూబాబాద్: ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్లను తొలగించిన ప్రభుత్వం

మహబూబాబాద్ జిల్లాలో ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్లను ప్రభుత్వం తొలగించింది. తొర్రూరు, నెల్లికుదురు, బయ్యారం, కేసముద్రం, కురవి సొసైటీల ఛైర్మన్లను తొలగించి, వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. తొర్రూరుకు రమేశ్, బయ్యారానికి ఆదినారాయణ, నెల్లికుదురుకు మోహన్ రావు, కేసముద్రానికి ప్రవీణ్, కురవికి సుమలత ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరించారు.