News February 22, 2025
యువతను శక్తివంతంగా మార్చడమే లక్ష్యం: శ్రీధర్ బాబు

టాస్క్ & శ్రీ సత్యసాయి సేవా సంస్థతో కలిసి ఉచిత డేటా ఇంజినీరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు. డిమాండ్లో ఉన్న టెక్ నైపుణ్యాలు,ఉద్యోగ అవకాశాలతో తెలంగాణ యువతను శక్తివంతంగా మార్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News January 28, 2026
అయ్యర్ ఏం పాపం చేశాడు.. గంభీర్పై విమర్శలు

NZతో నాలుగో టీ20 మ్యాచులో టీమ్ ఇండియా ప్లేయింగ్-11పై విమర్శలు వస్తున్నాయి. ఇషాన్ కిషన్ దూరమైతే అతడి స్థానంలో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను కాకుండా బౌలర్ (అర్ష్దీప్ సింగ్)ను తీసుకోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయ్యర్ 3, 4 స్థానాల్లో అద్భుతంగా ఆడగలడని, ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీస్తున్నారు. ఐదుగురు ప్రొఫెషనల్ బౌలర్లు జట్టులో ఎందుకని హెడ్ కోచ్ గంభీర్ను ప్రశ్నిస్తున్నారు.
News January 28, 2026
వికారాబాద్: తొలిరోజు.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..?

వికారాబాద్ జిల్లాలో తొలిరోజు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన పరిగిలో 2, తాండూర్ 11, వికారాబాద్లో 12 నామినేషన్లను అభ్యర్థులు వేశారు. కాగా CM ఇలాకా అయిన కొడంగల్లో ఒక్క నామినేషన్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అయితే తొలిరోజు మందకొడిగా ఈ ప్రక్రియ సాగినా రేపట్నుంచి వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.
News January 28, 2026
కృష్ణా: పవన్ కళ్యాణ్తో ఎంపీ బాలశౌరి భేటీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ను ఎంపీ కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు పనులు, నియోజకవర్గ సమస్యలను పవన్ దృష్టికి బాలశౌరి తీసుకెళ్లారు.


