News February 22, 2025

సిరిమాను చెట్టును ఊరేగించేందుకు ఏర్పాట్లు

image

శ్రీ శ్యామలాంబ అమ్మవారి సిరిమాను చెట్టును అల్లువీధి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు 30 జతల ఎద్దులతో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి శ్రీ శ్యామలాంబ అమ్మవారి గుడి మీదుగా శివాజీ సెంటర్, బోసు బొమ్మ జంక్షన్, డబ్బివీధి, కోట జంక్షన్, NTR బొమ్మ జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా అల్లు వీధికి చేర్చనున్నారు. ఈ సందర్భంగా కోలాటం, తప్పెటగుళ్ల ప్రదర్శన ఉంటుందని కమిటీ తెలిపింది. 

Similar News

News February 23, 2025

కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

image

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.

News February 23, 2025

NGKL: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు.!

image

మహాశివరాత్రి సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మొత్తం 58 బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సు సర్వీసులను శివ స్వాములు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 23, 2025

కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

image

AP: వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన <<15497715>>కొత్త రేషన్ కార్డులు<<>> అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగంలో మాట్లాడుతూ పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఇక రైతులకు పెండింగ్‌లో ఉన్న రవాణా, హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.

error: Content is protected !!