News February 22, 2025
పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

బల్దియా పరిధిలోని పలు డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులను GWMC కమిషనర్ డా.అశ్వినీ తానాజీ వాఖేడే శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాజీపేటలో సీసీ రోడ్డు డ్రైన్, రంగంపేటలో సీసీ రోడ్డు డ్రైన్, శివనగర్లో సీసీ రోడ్డు, 35వ డివిజన్ ఏసీ రెడ్డి నగర్ కాలనీ సీసీ రోడ్డు, ఉర్సు గుట్ట వద్ద వినాయక నిమజ్జన ప్రాంత పరిశీలించారు. కొనసాగుతున్న పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 12, 2025
హుజురాబాద్: రోడ్డు యాక్సిడెంట్ వ్యక్తి మృతి

హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట నుంచి హర్షిత్, త్రినేష్ ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ వైపు వెళ్తుండగా సిరిసపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్షిత్, త్రినేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 12, 2025
VZM: ‘జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి’

డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భబిత పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించాలని సూచించారు. వారెంట్ పెండింగ్, గంజాయి, పోక్సో కేసుల ముద్దాయిలకు అవగాహన కల్పించి నేరాలను తగ్గించాలని పేర్కొన్నారు.
News November 12, 2025
MHBD కలెక్టరేట్లో జిల్లా దిశా కమిటీ సమావేశం

MHBD కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం కమిటీ ఛైర్మన్, ఎంపీ పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎమ్మెల్యే మురళీ నాయక్, లెనిన్ వత్సల్ టోప్పో, కె.అనిల్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు ఉన్నారు.


