News February 22, 2025
OCల సంఖ్యను కేసీఆర్ ఎక్కువగా చూపారు: సీఎం రేవంత్

TG: కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఓసీల సంఖ్యను ఎక్కువగా చూపారని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ సర్వేలో 21 శాతం ఓసీలు ఉంటే తమ సర్వేలో 17 శాతమే ఉన్నట్టు తేలిందన్నారు. ప్రజాభవన్లో సీఎం మాట్లాడారు. ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఎందుకు సర్వేలో పాల్గొనలేదు. మేం ముస్లింలను బీసీల్లో కలిపితే బండి సంజయ్ ఎలా ప్రశ్నిస్తారు. గుజరాత్లో 70 ముస్లిం కులాలను బీసీల్లో చేర్చింది కనబడలేదా?’ అని సీఎం ఫైర్ అయ్యారు.
Similar News
News January 3, 2026
ఆస్ట్రోనాట్స్కు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తీసేస్తారు

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తొలగిస్తారట. సాధారణంగా వీటితో సమస్యలుండవు. కానీ ఇబ్బంది వస్తే త్వరగా తొలగించాలి. అందుకే.. అంతరిక్షంలో ఉండగా వీటి సమస్య వస్తే కష్టమని ముందే ఆపరేషన్ చేస్తారట. ఇటీవలే స్పేస్లోకి వెళ్లొచ్చిన శుభాంశు శుక్లా ఈ విషయం వెల్లడించారు. సెల్ఫ్ ట్రీట్మెంట్పై ట్రైనింగ్ ఇస్తారని, ఆపరేషన్లు లాంటివి మాత్రం అక్కడి జీరో గ్రావిటీలో చేసుకోలేమన్నారు.
News January 3, 2026
నల్లమల సాగర్కు రేవంత్ పరోక్ష అంగీకారం: హరీశ్రావు

నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాలు పంపిన పేర్లకు కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిపి <<18742119>>కమిటీ<<>> ఖరారు చేసినట్లు మాజీమంత్రి హరీశ్రావు తెలిపారు. ‘3నెలల్లో నీటి పంపకాలు పూర్తి చేయడమంటే 3 నెలల్లో నల్లమల సాగర్ను ఆమోదించడమే. ఇందుకు AP పెట్టిన టెండర్ గడువు తీరాకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అంటే రేవంత్ సర్కార్ ఆ ప్రాజెక్టును పరోక్షంగా అంగీకరిస్తోందని అర్థమవుతోంది’ అని ట్వీట్ చేశారు.
News January 2, 2026
కూనంనేని క్షమాపణలు చెప్పాలి: బండి సంజయ్

TG: PM మోదీకి <<18744541>>MLA కూనంనేని<<>> సాంబశివరావు క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘దేశంలో కమ్యూనిజం కనుమరుగవడానికి ఇలాంటి భాషే కారణమనిపిస్తోంది. అసెంబ్లీలో అలాంటి భాషకు స్థానంలేదు. ప్రభుత్వం, స్పీకర్ ఖండించకుండా మర్యాదని మరిచి వారి మిత్రపక్షాన్ని సమర్థించారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుంటే.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ రాజకీయాలు దుర్భాషల దగ్గరే ఆగిపోయాయి’ అని ట్వీట్ చేశారు.


