News February 22, 2025
కాంగ్రెస్ అసమర్థత వల్లే SLBC ఘటన: హరీశ్

TG: SLBC <<15542138>>సొరంగం<<>> కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనమని హరీశ్రావు మండిపడ్డారు. 4 రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతోందని తెలిసినా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు, KTR స్పందిస్తూ.. ఘటన ఉ.8:30కు జరిగితే మధ్యాహ్నం దాకా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 23, 2025
పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం?

TG: సిమెంట్, స్టీల్ ఖర్చు లేకుండా ఉండేందుకు ఇందిరమ్మ ఇళ్లను పిల్లర్లు లేకుండా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లర్ల నిర్మాణానికి వ్యయం ఎక్కువై లబ్ధిదారులు ఇళ్లను అసంపూర్తిగా ఆపేస్తారనే కారణంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మండలానికి ఒకటి చొప్పున మోడల్ ఇళ్లను నిర్మించనుంది. పిల్లర్లు, బీములు లేకుండా నిర్మించేందుకు ‘న్యాక్’లో కొందరు మేస్త్రీలకు శిక్షణ ఇచ్చింది.
News February 23, 2025
5 జిల్లాల పరిధిలో అమరావతి ORR.. కేంద్రం గెజిట్

AP: రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 189.9KM మేర అలైన్మెంట్కు ఓకే చెప్పింది. 5 జిల్లాల(ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు) పరిధిలోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. త్వరలోనే భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ORRలో 2 బ్రిడ్జిలు, 78 అండర్పాస్లు, 65 వంతెనలు నిర్మిస్తారు.
News February 23, 2025
మైనర్ బాలికే.. కానీ ఆమెకు అన్నీ తెలుసు: బాంబే హైకోర్టు

మైనర్ బాలికే అయినా ఓ వ్యక్తితో గడిపితే ఎదురయ్యే పర్యవసానాలు అన్నీ ఆమెకు తెలుసని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, ఓ యువకుడితో మూడు రాత్రిళ్లు పరస్పర ఇష్టంతో గడిపింది. కానీ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి ఐదేళ్లు జైల్లో పెట్టారు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం పరస్పరం ఇష్టంతో గడిపినందుకే అతడికి బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది.