News February 22, 2025

రేపు భారత్ ఓడిపోతుంది: IIT బాబా

image

మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా వైరల్ అయిన అభయ్ సింగ్ రేపు పాకిస్థాన్‌తో మ్యాచులో భారత్ ఓడిపోతుందని అంచనా వేశారు. ‘నేను ఇప్పుడే చెబుతున్నానుగా ఇండియా అస్సలు గెలవదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని స్పష్టం చేశారు. బాబా కామెంట్లపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Similar News

News February 23, 2025

INDvsPAK: భారత జట్టులో మార్పులుంటాయా?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ భారత్-పాక్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు టీమ్ ఇండియా ఫైనల్ 11లో ఎవరుంటారనే చర్చ మొదలైంది. బంగ్లాతో ఆడిన జట్టునే కొనసాగిస్తారని విశ్లేషకులు అంటున్నారు. అయితే కుల్దీప్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ ప్లేస్‌లో యార్కర్ల స్పెషలిస్ట్ అర్ష్‌దీప్‌ను తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఏ ప్లేయర్ బెస్ట్? మీ కామెంట్.

News February 23, 2025

మళ్లీ ఏడాది కోర్సుగా B.Ed, M.Ed?

image

AP: బీఈడీ, ఎంఈడీ కోర్సులను తిరిగి ఏడాది కోర్సులుగా ప్రవేశపెట్టాలని NCTE యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై NCTE వెబ్‌సైట్‌లో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఆ తర్వాత ఏడాది ఫార్మాట్‌లోకి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పదేళ్ల క్రితం B.Ed, M.Ed కోర్సులు ఏడాది పాటే ఉండగా, రెండేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే.

News February 23, 2025

రేపే అకౌంట్లలోకి పీఎం కిసాన్ నిధులు

image

పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుంది. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ నిధులు విడుదల చేస్తారు. దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేయనున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 లక్షలకుపైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రూ.1,460 కోట్లకుపైగా నిధులు విడుదల కానున్నాయి.

error: Content is protected !!