News February 22, 2025
నంద్యాల జిల్లా TODAY TOP NEWS..!

☞ భూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడాలి: ఆర్డీఓ విశ్వనాథ్ ☞ గోర్విమానుపల్లెలో టికెట్లు తనిఖీ చేసిన ఆళ్లగడ్డ డీఎస్పీ ☞ ఆకట్టుకుంటున్న అవుకు రిజర్వాయర్ అందాలు ☞ మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి తరఫున పట్టు వస్త్రాలు ☞ శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ వద్ద ప్రమాదం ☞ విద్యార్థినుల అశ్లీల చిత్రాల వ్యాపారంలో నిందితుల అరెస్ట్ ☞ జిల్లాలోని అన్ని మండలాల్లో ఉయ్యాలవాడ వర్ధంతి వేడుకలు
Similar News
News November 4, 2025
పురుగు మందుల పిచికారీ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

☛ పురుగు మందుల పిచికారీకి అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్, నాజిల్స్ ఎన్నుకోవాలి. ☛ ద్రావణం తయారీకి మంచినీరే వాడాలి. సిఫార్సు చేసిన మోతాదునే పిచికారీ చేయాలి. తక్కువ వాడితే మందు పనిచేయదు. ఎక్కువ వాడితే పురుగు రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. ☛ ఎండ తీవ్రత, గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు కమ్మినప్పుడు, వర్షం కురిసే ముందు పిచికారీ చేయరాదు. ☛ జలాశయాలు, చెరువులు, నీరుండే చోటు దగ్గరలో మందు కలపకూడదు.
News November 4, 2025
జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. చిన్నచింతకుంట 19.5, మిడ్జిల్ 11.3, కౌకుంట్ల 18.8, దేవరకద్ర 17.0, మహబూబ్నగర్ గ్రామీణ 9.8, అడ్డాకుల 8.5, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News November 4, 2025
VZM: రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి

విజయనగరం జిల్లాలో 109 చిన్నతరహా చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. చెరువుల అభివృద్ధిపై నేడు సమావేశం నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ పథకం క్రింద ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో ఈ చెరువులు అభివృద్ధి కానున్నాయని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలన్నారు.


