News February 22, 2025

15 ని. ముందే సెంటర్లకు చేరుకోవాలి: APPSC

image

AP: రేపు గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ప్రకటించిన APPSC.. అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. ఆదివారం ఉ.10 గం. నుంచి మ.12.30 గం. వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2 ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. 92,250 మంది మెయిన్స్ రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లు ఏర్పాటు చేసింది.

Similar News

News November 11, 2025

తెలంగాణ న్యూస్

image

⋆ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో CID విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. గంటపాటు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు
⋆ HYD: ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ MLAలు బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, రామదాసుపై మధురా నగర్ పీఎస్‌లో కేసు నమోదు.. BRS నేతలు వినయ్ భాస్కర్, ఆనంద్‌పై బోరబండ పీఎస్‌లో కేసు నమోదు
⋆ మరో గంటలో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌

News November 11, 2025

అధిక పాలిచ్చే పశువును ఎలా గుర్తించాలి?(1/2

image

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.

News November 11, 2025

అధిక పాలిచ్చే పాడి పశువును ఎలా గుర్తించాలి?(2/2)

image

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.