News February 22, 2025

తిరుపతి జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్: తిరుపతి JC
✒ తిరుపతి: ఒకే వేదికపై 100 మంది కవలలు
✒ ఏర్పేడు: IIT లో సందడి చేసిన తమన్
✒ చంద్రగిరి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి
✒ అమ్మాయి న్యూడ్ ఫొటోలతో తిరుపతి యువకుడి వ్యాపారం
✒ ఘనంగా శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణం (వీడియో)

Similar News

News February 23, 2025

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి : ADB MP

image

ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు చిన్నమయల్ అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని ADB ఎంపీ గోడెం నగేష్ అన్నారు. శనివారం మామడ మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు రంజిత్ కుమార్, నాయకులు చందు, నారాయణ రెడ్డి, బాపురెడ్డి, రాజారెడ్డి, నవీన్, గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.

News February 23, 2025

రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

image

TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఆదిలాబాద్ రాం లీలా మైదానంలో వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

News February 23, 2025

గింజేరు జంక్షన్‌లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

గంట్యాడ మండలం గింజేరు జంక్షన్ వద్ద రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఆనంద్(55) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు విజయనగరం నుంచి ఎస్.కోట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆనంద్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్రాసుపత్రికి 108లో తరలించారు.

error: Content is protected !!