News February 22, 2025
MBNR: ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఎస్ఎల్బీసీ ఎడమగట్టు కాలువ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో అనేక మంది కార్మికులు గాయాలపాలు కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులను పునఃప్రారంభం చేశారు. ఇంతలోనే ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Similar News
News December 28, 2025
MBNR: SSC, INTER.. అప్లై చేసుకోండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరెందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. వచ్చేనెల 5లోగా.. ఫైన్తో 16లోగా అప్లై చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. www.telanganaopenschool.org వెబ్ సైట్ సందర్శించాలన్నారు. SHARE IT
News December 28, 2025
ALERT: చైనా మాంజా.. సమాచారం ఇవ్వండి: SP

ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించి చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా మానేయాలని, ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
News December 28, 2025
MBNR: U-14..హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక

MBNRలోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్-14 బాల, బాలికలకు హ్యాండ్ బాల్ జట్టు ఎంపికలు నిర్వహించారు. మొత్తం 70 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారు నారాయణపేటలో నేటి నుంచి ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు హాజరవుతున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు.పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్,గనేశ్వరి పాల్గొన్నారు.


