News March 21, 2024

లంచగొండిల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్!

image

TG: సీవీ ఆనంద్ నేతృత్వంలోని ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారుల భరతం పడుతోంది. దీంతో లంచం అడిగిన అధికారుల వివరాలను తెలిపేందుకు బాధితులు సైతం ముందుకొస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమా రాణి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెయింగ్ మెషీన్‌లకు సంబంధించిన వ్యాలిడిటీ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఆమె రూ.10వేలు డిమాండ్ చేశారు.

Similar News

News April 12, 2025

పారిశ్రామిక వృద్ధి డౌన్

image

ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 6 నెలల కనిష్ఠమైన 2.9 శాతానికి పరిమితమైంది. తయారీ, గనుల తవ్వకం, విద్యుదుత్పత్తి రంగాల పేలవ పనితీరే కారణమని NSO వెల్లడించింది. గతేడాది FEBలో తయారీ వృద్ధి 4.9 శాతం ఉండగా ఈ ఏడాది అది 2.9 శాతానికి చేరింది. అలాగే మైనింగ్ 8.1% నుంచి 1.6%కి, విద్యుదుత్పత్తి 7.6% నుంచి 3.6%కి దిగివచ్చింది. అయితే మార్చి, ఏప్రిల్‌లో పరిస్థితి మెరుగుపడొచ్చని నిపుణుల అంచనా.

News April 12, 2025

సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు

image

AP: అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. దీంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో షేర్ మార్కెట్ పనులు చేసుకుంటూ అతను విధులకు గైర్హాజరయ్యారు. దీంతో అతనిపై చర్యలకు ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. దీని నుంచి తప్పించుకునేందుకు CM, మంత్రి పేర్లతో సిఫారసు లేఖ తయారుచేసి సతీశ్ దొరికిపోయారు.

News April 12, 2025

KGBVల్లో ఇంటర్ ప్రవేశాలు.. గడువు పొడిగింపు

image

AP: రాష్ట్రంలోని KGBVల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 21 వరకు పొడిగించారు. SC, ST, BC, మైనారిటీ, డ్రాపౌట్స్, అనాథలు మాత్రమే అప్లై చేసుకోవాలని సమగ్ర శిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు.
వెబ్‌సైట్: <>https://apkgbv.apcfss.in/<<>>

error: Content is protected !!