News March 21, 2024

లంచగొండిల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్!

image

TG: సీవీ ఆనంద్ నేతృత్వంలోని ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారుల భరతం పడుతోంది. దీంతో లంచం అడిగిన అధికారుల వివరాలను తెలిపేందుకు బాధితులు సైతం ముందుకొస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమా రాణి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెయింగ్ మెషీన్‌లకు సంబంధించిన వ్యాలిడిటీ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఆమె రూ.10వేలు డిమాండ్ చేశారు.

Similar News

News October 6, 2024

ఈ విషయాన్ని గమనించారా?

image

మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా LTE, VoLTE అనే గుర్తును నెట్‌వర్క్ బార్ పక్కన చూసుంటారు. అయితే, అలా ఎందుకు ఉందో చాలా మందికి తెలియదు. VoLTE అంటే వాయిస్ ఓవర్ లాంగ్-టర్మ్ ఎవల్యూషన్. మెరుగైన కాలింగ్ ఫీచర్‌, వాయిస్& డేటాను ఏకకాలంలో ఉపయోగించే సామర్థ్యాన్ని ఇది అందిస్తుంది. HD వాయిస్, వీడియో కాలింగ్, రిచ్ కాల్ సర్వీస్‌ల వంటి మెరుగైన కాలింగ్ ఫీచర్‌లు పొందవచ్చు. ఇది 2011లో అందుబాటులోకి వచ్చింది.

News October 6, 2024

స్వర్ణయుగంలోకి రెసిడెన్షియల్ స్కూల్స్: భట్టి

image

TG: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తో రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.5వేల కోట్లతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. దసరా ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా పనులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. భవనాల డిజైన్‌లకు సంబంధించిన ఫొటోలను ఆయన Xలో పంచుకున్నారు.

News October 6, 2024

7 నెలల్లో స్కూళ్ల నిర్మాణాలు పూర్తి: భట్టి

image

TG: అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని, 7 నెలల్లో ఆ నిర్మాణాలు పూర్తి చేస్తామని డిప్యూటీ CM భట్టి చెప్పారు. దేశానికే ఆదర్శంగా ఈ స్కూల్స్ ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కూల్ ఉంటుందని, ఒక్కో స్కూలుకు రూ.25కోట్లు ఖర్చు చేస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.