News February 23, 2025

పోక్సో, గ్రేవ్ కేసుల విచారణ పూర్తి చేయాలి: ఎస్పీ

image

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఎస్పీ డివి శ్రీనివాసరావు నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు.

Similar News

News November 10, 2025

నేటి నుంచి ‘స్వామిత్వ’ గ్రామసభలు

image

APలో <<18165882>>స్వామిత్వ<<>>(SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలకు అర్హులైన యజమానులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ముందు అభ్యంతరాలకు స్వీకరణ చేయనుంది. ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 22 వరకు గ్రామ సభలు నిర్వహించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.

News November 10, 2025

మీరు ఈరోజు జైనథ్ వెళ్తున్నారా..?

image

జైనథ్‌లో నల్లరాతితో నిర్మితమైన లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం ఆకట్టుకుంటోంది. శిలాశాసనాలు, అద్భుతమైన శిల్పాలతో నిర్మితమైన ఈఆలయం 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం మధ్య కాలానికి చెందినదని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. ఆలయ గోడలపై చెక్కిన 20 శ్లోకాలు, జైన సంప్రదాయానికి సంబంధించిన చిహ్నాలు చరిత్రప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. నేడు ఇక్కడ స్వామివారి రథోత్సవానికి వేలాదిగా భక్తులు వస్తారు. మీరు వెళ్తున్నారా?

News November 10, 2025

చీపుర పుల్లల కోసం వెళ్లి.. మృతి

image

బల్లికురవ మండలం సురేపల్లిలోని కొండ మీదకు రామాంజనేయులు(65) ఆదివారం చీపుర పుల్లల కోసం వెళ్లి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన గొర్రెల కాపరులు, స్థానికులు 108కు సమాచారం అందించారు. కొండ మీద నుంచి అతనిని కిందకు తీసుకొస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.