News February 23, 2025
BREAKING: మైనర్లపై పెట్రో దాడి.. గాయాలు

పేట్ బషీరాబాద్ PS పరిధిలో దారుణం జరిగింది. జై రామ్ నగర్లోని నిర్మాణుష్య ప్రాంతంలో ఆడుకునేందుకు ఐదుగురు మైనర్లు (ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు బాలికలు) వెళ్లారు. ఇద్దరు అమ్మాయిలపై జరిగిన పెట్రోల్ దాడిలో ఒక బాలిక(10)కు తీవ్ర గాయలు, మరో బాలిక(9)కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైనర్లకు పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టే ఎక్కడి నుంచి వచ్చాయన్నది మిస్టరీగా మిగిలింది.
Similar News
News February 23, 2025
హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించగా.. తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో పనులకు జీహెచ్ఎంసీ టెండర్లకు ఆహ్వానించింది.
News February 23, 2025
ఆదివారం: HYDలో పతనమవుతున్న చికెన్ ధరలు

HYDలో చికెన్ ధరలు పతనం అవుతున్నాయి. KG మీద ఏకంగా రూ.18 నుంచి రూ.20 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ 168, విత్స్కిన్ KG రూ.148గా ఉండగా.. నేడు మోరోసారి భారీగా పడిపోయాయి. KG స్కిన్లెస్ రూ.152, విత్ స్కిన్ రూ. 133 చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. హోల్సేల్ దుకాణాల్లో ఇంకా తగ్గించి విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ధర ఎంత?
News February 23, 2025
HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.