News February 23, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,64,158 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,17,832, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.89,820 అన్నదానం రూ.56,506 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News February 23, 2025

BJPని గెలిపిస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారుతుంది: R.కృష్ణయ్య

image

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని గ్రాడ్యుయేట్లు, టీచర్లను ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారుతుంది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయి. ఇటీవల ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా ఇవ్వాలి. రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి. ఓటర్లు చిన్న చిన్న ప్రలోభాలకు లొంగవద్దు’ అని సూచించారు.

News February 23, 2025

రేణిగుంట: ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

image

తిరుపతి పర్యటన నిమిత్తం వచ్చిన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడుకి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ఆప్యాయంగా పలకరించి కాసేపు ముచ్చటించారు. చంద్రగిరి అభివృద్ధిపై ఆరా తీశారు.

News February 23, 2025

‘రాజా సాబ్’ మూవీపై క్రేజీ న్యూస్ వైరల్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజా సాబ్’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాప్ మోస్ట్ కమెడియన్స్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిశోర్, సప్తగిరి, గెటప్ శ్రీను, యోగిబాబు, వీటీవీ గణేశ్‌ తదితరులను డైరెక్టర్ మారుతి తీసుకున్నట్లు టాక్. వీరి కోసం స్పెషల్ స్క్రిప్ట్ రాసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 10న మూవీ విడుదల కానుంది.

error: Content is protected !!