News February 23, 2025
ప్రకాశం: ‘ఫేక్ డాక్యుమెంట్స్ సేకరించాలి’

ఒంగోలు, పరిసర ప్రాంతాలలో నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో రెండేళ్ళ క్రితం వెలుగుచూసిన భూ అక్రమాలపై.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోడియా అరా తీశారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో ప్రకాశం భవనంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థలాలకు ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరు సృష్టించారో ఆధారాలను సేకరించాలని ఆదేశించారు.
Similar News
News November 6, 2025
ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 6, 2025
ఒంగోలు: 10 నుంచి అసెస్మెంట్ పరీక్షలు

ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 గంటల నుంచి 12.35గంటల వరకు.. 6, 7వ తరగతి విద్యార్థులకు 1.15 గంటల నుంచి 4.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
News November 6, 2025
మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇలా..!

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి రెవెన్యూ జిల్లాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపేలా ప్రతిపాదించారు. మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరును కందుకూరు డివిజన్లోకి మార్చనున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిపి అద్దంకి డివిజన్గా ఏర్పాటు కానుంది. డిసెంబర్ నెలాఖారు లోపల ఈ ప్రక్రియ పూర్తి కానుంది.


