News February 23, 2025
నస్తూర్ పల్లి అడవుల్లో పెద్దపులి సంచారం.. బస్సుల్లో ప్రయాణం!

కాటారం మండలంలోని నస్తూర్ పల్లి గ్రామ సమీప అడవుల్లో పెద్దపులి సంచరించిందనే వార్త వ్యాప్తి చెందింది. దీంతో మండలంలోని అటవీ సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. కాటారం నుంచి కాళేశ్వరం తదితర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు బైకులను పక్కనపెట్టి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. పులి మహాదేవపూర్ మండలంలోని బొమ్మపూర్ వైపు ప్రయాణించిందని చర్చ జోరుగా నడుస్తోంది. కాగా, దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Similar News
News January 14, 2026
విశాఖ నుంచి వందే భారత్ రైళ్లు అదనంగా నడపాలని లేఖ

విశాఖపట్నం విమానాశ్రయం జూన్–జులై నెలల్లో భోగాపురానికి మారనున్న నేపథ్యంలో నగరం నుంచి అదనంగా వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు లేఖ రాశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ప్రయాణికుల రద్దీ మరింత పెరగనుందని లేఖలో వివరించారు.
News January 14, 2026
చిట్వేల్లో సంక్రాంతి పండుగ.. కుటుంబం అంతా ఒకే చోట భోజనం..!

సంక్రాంతి పండుగతో కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని చిట్వేల్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. గత 50 ఏళ్లుగా భోగి రోజున నలుగురు అన్నదమ్ముల కుటుంబాలు కలిసి సంయుక్త అరిటాకు భోజనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది 46 మంది కుటుంబ సభ్యులు పాల్గొనగా, హైదరాబాదు, బెంగళూరు, విదేశాల్లో ఉన్నవారు కూడా భోగి రోజున కలుస్తారన్నారు. దీంతో కుటుంబాల్లో ప్రేమానురాగాలు మరింత బలపడతాయన్నారు.
News January 14, 2026
ASF: నూతన సర్పంచుల శిక్షణ వివరాలు

ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు చెందిన 335 మంది సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొత్తం 35 రోజుల పాటు 7 బ్యాచ్లుగా, 2 టీమ్ల ద్వారా శిక్షణ అందించనున్నారు. గ్రామాభివృద్ధి, పాలన, ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు అవగాహన కల్పించనున్నారు.


