News February 23, 2025

ధర్మవరంలో కిలో చికెన్ రూ.140

image

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ధర్మవరంలో ఇవాళ కిలో చికెన్ రూ.140-160 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Similar News

News January 18, 2026

నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

image

నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో గ్రీవెన్స్ డే సోమవారం జరగనుంది. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా అధికారులకు అందజేయవచ్చని చెప్పారు. Meekosam.ap.gov.in, 1100 కాల్ సెంటర్ ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News January 18, 2026

జగన్ ఉన్మాదానికి మరో BC నేత బలి: TDP

image

AP: మరో బీసీ నేతను జగన్ ఉన్మాదం బలి తీసుకుందని TDP మండిపడింది. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన TDP నాయకుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లి వస్తున్న బీసీ నేత లాలం బంగారయ్యను YCP నేతలు హత్య చేశారని ఆరోపించింది. బీసీ నేతలే టార్గెట్‌గా YCP చేస్తున్న దాడులు, హత్యలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పింది. అధికారం దక్కలేదనే పగతో ప్రజలను జగన్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించింది.

News January 18, 2026

మేడ్చల్ జిల్లాల్లో SSC, INTER పరీక్షలు రాసేది ఎంతమందంటే..?

image

వచ్చేనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను అధికారులు లెక్కించారు. 10వ తరగతి పరీక్షలకు 46వేల మంది, ఇంటర్ పరీక్షలకు 1.35 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల ఎంపికను అధికారులు వేగవంతం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేయనున్నారు.