News February 23, 2025
నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్ దారుణం: బొత్స

AP: గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తామంటూ చివరి వరకు నమ్మించి ప్రభుత్వం అభ్యర్థులను మోసం చేసిందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న అభ్యర్థులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య పరీక్ష నిర్వహణ ఆమోదయోగ్యం కాదని చెప్పారు.
Similar News
News November 5, 2025
133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<
News November 5, 2025
7 బిలియన్ ఏళ్ల కిందట విశ్వం టెంపరేచర్ ఎంత?

‘బిగ్ బ్యాంగ్’ ప్రకారం 13.8బిలియన్ ఏళ్ల కిందట ఏర్పడిన విశ్వంలో ఎన్నో అద్భుతాలు, రహస్యాలున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని జపాన్ సైంటిస్టులు కనుగొన్నారు. ఈ యూనివర్స్ టెంపరేచర్ ప్రస్తుతం 2.7K(కెల్విన్) ఉండగా, 7B ఏళ్ల కిందట 5.13 కెల్విన్(−268°C) ఉండేదని తేల్చారు. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ పరిశీలనలు.. విశ్వం క్రమంగా చల్లబడుతోందనే అంచనాలను ధ్రువీకరిస్తున్నాయి.
* సెల్సియస్= కెల్విన్-273.15
News November 5, 2025
భరణి నక్షత్రంలో కార్తిక పౌర్ణమి విశిష్టత

సాధారణంగా కార్తిక పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో శ్రేష్ఠమైనది. కానీ ఈ ఏడాది భరణి నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చింది. దీనికి ప్రత్యేక స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. ‘ఈ పౌర్ణమి+భరణి కలయిక పాపాలను పోగొట్టి, మోక్షాన్ని, పితృదేవతల ప్రసాదాన్ని ఇస్తుంది. నేడు చేసే దీపదానం, పితృతర్పణం, గంగాస్నానం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. కృత్తిక జ్ఞాన ప్రకాశాన్నిస్తే భరణి పాప నాశనం చేస్తుంది’ అంటున్నారు.


