News February 23, 2025
మిస్డ్ కాల్ వస్తే తిరిగి ఫోన్ చేయకండి: అన్నమయ్య ఎస్పీ

గుర్తుతెలియని నంబర్లనుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి కాల్ చేయొద్దని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న +371(5), +381(2) నంబర్ల నుంచి కాల్ చేసి #90లేదా #09డయల్ చేయమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో కాల్ చేయవద్దన్నారు. అలాచేస్తే నేరగాళ్లు మీ ఫోన్ హ్యాక్ చేస్తారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే1930కు కాల్ చేయమన్నారు.
Similar News
News January 13, 2026
మన ఊరు దగ్గరవుతున్న కొద్దీ ఆ ఫీలింగే వేరు!

సంక్రాంతికి పట్టణాలన్నీ ఖాళీ అవుతుండగా పల్లెలు సందడిగా మారాయి. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు చేరుకోగా, మరికొందరు ప్రయాణాల్లో ఉన్నారు. అయితే మన ఊరు కొద్ది దూరంలో ఉందనగా కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని పలువురు SMలో పోస్టులు పెడుతున్నారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, స్కూల్, చెరువు, పొలాలు తదితరాలు గుర్తుకొస్తాయి. పండగకి ఊరెళ్లేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో.. తిరిగొచ్చేటప్పుడు అంతే బాధగా అన్పిస్తుంది కదా?
News January 13, 2026
ప్రభుత్వం పనితీరుపై చిత్తూరు ప్రజల స్పందన ఇదే..!

ప్రభుత్వ సేవలు అందడంలో చిత్తూరు జిల్లాలో 66% మందే సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పింఛన్ల పంపిణీపై 85.4, అన్న క్యాంటీన్లపై 84.4, దీపం పథకంపై 66.2, ఆర్టీసీ బస్సులపై 70.9, వైద్య సేవలపై 62.4, రిజిస్ట్రేషన్ సేవలపై 64.2, హౌసింగ్ పథకంపై 52.9, రెవెన్యూ సేవలపై 45.5, రెవెన్యూ సర్వేపై 45.1 శాతం సంతృప్తి ఉందని వివరించారు.
News January 13, 2026
మెదక్: కౌన్సిలర్ అభ్యర్థుల్లో రిజర్వేషన్ టెన్షన్

మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటరు జాబితా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపైనే ఉంది. తమ వార్డు ఏ వర్గానికి కేటాయిస్తారోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టికెట్ల కోసం పైరవీలు ముమ్మరం చేస్తూనే, వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారైతేనే పోటీపై స్పష్టత రానుంది.


