News February 23, 2025
యూజీసీ NET ఫలితాల విడుదల

యూజీసీ నెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం జనవరిలో పరీక్షలు జరిగాయి. ఇందుకు సంబంధించిన కీని ఈ నెల 3న విడుదల చేసింది. నెట్ పరీక్షకు 6.49 లక్షల మంది హాజరయ్యారు. JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 5,158 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD అడ్మిషన్కు 48,161 మంది, PhD కోసం 1,14,445 క్వాలిఫై అయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News February 23, 2025
న్యూయార్క్-న్యూ ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. మళ్లింపు

అమెరికాలోని న్యూయార్క్ నుంచి న్యూ ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ AA292ను ఇటలీలోని రోమ్ నగరానికి మళ్లించారు. తుర్కియే వరకు వచ్చిన ఆ విమానాన్ని తిరిగి వెనక్కి పంపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
News February 23, 2025
MOST RUNS: పాంటింగ్ను దాటేసిన కోహ్లీ

టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డులు కొల్లగొడుతున్నారు. PAKపై అద్భుత ఇన్నింగ్సుతో మరో రికార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన మూడో ఆటగాడిగా నిలిచారు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ (27483)ను అధిగమించారు. సచిన్ (34357), సంగక్కర (28016), విరాట్ కోహ్లీ (27484) టాప్-3లో ఉన్నారు.
News February 23, 2025
అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సిద్ధం: జెలెన్స్కీ

ఉక్రెయిన్లో శాంతి నెలకొనడం కోసం అధ్యక్ష పదవిని వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. శాంతి నెలకొల్పినా లేదా నాటో స్యభ్యత్వం ఇచ్చినా ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దేశ భద్రతే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. పదేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగాలనేది తన కల కాదని పేర్కొన్నారు. తమ దేశానికి US భద్రతా హామీలు ఇవ్వాలని కోరారు.