News February 23, 2025

హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

హైదరాబాద్ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించగా.. తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో పనులకు జీహెచ్ఎంసీ టెండర్‌లకు ఆహ్వానించింది.

Similar News

News February 23, 2025

HYD: పిల్లలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..!

image

గ్రేటర్ HYD పరిధిలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. POCSO చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. 2022- 426, 2023- 559, 2024- 713 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదలపై పోలీసులు, సామాజిక సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో జరుగుతున్న క్రైమ్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

News February 23, 2025

HYD: మోదీ పక్కా బీసీ: MP ఆర్.కృష్ణయ్య

image

నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య మోదీపై వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. మోదీ పక్కా బీసీ అని, ఆయన ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. బీజేపీ పూర్తిగా బీసీల పార్టీగా మారిందని, బీజేపీ బీసీని ప్రధానిని చేసిందని, మోదీ ఒక యోగి, సీఎం రేవంత్ మోదీ కులంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భారత కీర్తి ప్రతిష్ఠలు ఖండాంతరాలు దాటాయన్నారు.

News February 23, 2025

హైదరాబాద్: సీఎం విజన్‌కు అనుగుణంగా చర్యలు: HMR MD

image

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాల్గో నగరంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా చర్యలు ప్రారంభించినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌ను అధికారులు, సిబ్బందితో కలిసి ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలుష్య రహిత హరిత నగరంగా, ఫ్యూచర్‌ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు HMR డీపీఆర్‌ సిద్ధం చేస్తోందని వెల్లడించారు.

error: Content is protected !!