News February 23, 2025

BJPని గెలిపిస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారుతుంది: R.కృష్ణయ్య

image

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని గ్రాడ్యుయేట్లు, టీచర్లను ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారుతుంది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయి. ఇటీవల ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా ఇవ్వాలి. రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి. ఓటర్లు చిన్న చిన్న ప్రలోభాలకు లొంగవద్దు’ అని సూచించారు.

Similar News

News January 31, 2026

కల్తీ నెయ్యి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా YCP పూజలు

image

AP: కల్తీ నెయ్యి వివాదంలో దుష్ప్రచారం చేస్తున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకున్న CBN, పవన్‌కు భగవంతుడే బుద్ధి చెప్తారని YCP నేతలు చెప్పారు. వారి వ్యాఖ్యలను నిరసిస్తూ పాప పరిహార పూజలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ వంగా గీత, తూ.గో జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి, YSR జిల్లా బద్వేలులో MLA దాసరి సుధ, NTR జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని ప్రత్యేక పూజలు చేశారు.

News January 31, 2026

శుభకార్యాల్లో తమలపాకు ఎందుకు తప్పనిసరి?

image

మనం ప్రతి వేడుకల్లో తమలపాకును వాడుతాం. దీన్ని నాగవల్లి దళమని అంటారు. సకల దేవతల నివాసమని భావిస్తారు. దీని తొడిమలో లక్ష్మీదేవి, మధ్యలో పార్వతీదేవి, కొనభాగంలో సరస్వతీదేవి కొలువై ఉంటారు. అందుకే పూజలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో వాడుతారు. దీంతో తాంబూలం సమర్పిస్తే దైవిక శక్తి, సుస్థిరత చేకూరుతాయని నమ్మకం. ఆయుర్వేద పరంగా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అయితే పూజలకు పచ్చగా, తాజాగా ఉన్న ఆకునే వాడాలి.

News January 31, 2026

బంగాళాఖాతంలో ‘నో ఫ్లై జోన్’.. ఏం జరుగుతోంది?

image

ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలో సుమారు 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ భారత్ NOTAM జారీ చేసింది. గతంలో కంటే ఈ పరిధిని పెంచడం చూస్తుంటే DRDO ఏదైనా లాంగ్ రేంజ్ మిస్సైల్‌ను లేదా సముద్ర ఆధారిత క్షిపణిని పరీక్షించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ వరుసగా నిర్వహిస్తున్న ఈ ప్రయోగాలు పొరుగు దేశాల్లో గుబులు రేపుతున్నాయి.